వికారాబాద్ : వికారాబాద్ ప్రాంత ప్రజల సౌకర్యార్థం శివసాగర్ పరిసర ప్రాంతాల్లో పార్కుతో పాటు మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పనులు చేపట్టాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మినీ ట్యాంక్బండ్, పార్కు నిర్మాణం కోసం సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా నిర్మించబోతున్న పార్కుల్లో సకల సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
రానున్న రోజుల్లో శివసాగర్ పరిసర ప్రాంతంలో పార్కు, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందిస్తామన్నారు. ప్రణాళిక వలన పరిసర ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని వివరించారు. నాణ్యతతో పనులు చేపట్టి త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్కుమార్, ఆర్డీవో ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, మున్సిపల్ ఈఈ వెంకటేశ్వరరావు, తాసీల్దార్ రవీందర్, సర్వేయర్ మహేందర్ పాల్గొన్నారు.