పూడూరు : కులమతాలకు అతీతంగా ఆటపాటలతో పీర్ల పండుగను జరుపుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టంపల్లి, చన్గోముల్, కంకల్, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, గొంగుపల్లి, మన్నెగూడ మీర్జాపూర్ తదితర గ్రామాల్లో వారం రోజుల నుంచి పీర్లను మసీదులో ప్రతిష్టించి శుక్రవారం పీర్లను బయటికి తీసి హిందువులు, ముస్లింలు కలిసి ఉత్సహంగా ఊరేగించారు. యువకులు, పెద్దలు అలవా ఆడుతు సంతోషంగా పండుగను జరుపుకున్నారు.
పీర్లకు కుడుక, ఊదు బెల్లం, పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. శుక్రవారం చన్గోముల్లోని పీర్లకు ఎమ్మెల్యే ఊదు, బెల్లం, దట్టిలను సమర్పించారు. అనంతరం గ్రామస్తులతో పీర్ల ముందు ఎమ్మెల్యే అలావ అడిపాడారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బంధుమిత్రులతో పండుగ సందడి నెలకొంది. ఈ వేడుకల్లో ఎంపీపీ మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజారుద్దీన్, రహిస్ఖాన్, దాస్, చెన్నయ్య, విఠలయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.