రంగారెడ్డి, ఏప్రిల్ 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇప్పటికే 15 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభంకాగా, మిగతా కొనుగోలు కేంద్రాల్లో ఒకట్రెండు రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. కరోనా దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకేరోజు రైతులందరూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాకుండా రోజుకు 50 మంది చొప్పున రైతులు ధాన్యంతీసుకొచ్చేలా గ్రామాల వారీగా ఏఈవోలు ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 35,333ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా రెండు రోజు ల్లో డబ్బులు ప్రభుత్వమే జమ చేయనుంది.
ఇప్పటివరకు 500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో ఇప్పటివరకు 15కొనుగోలు కేంద్రాల ద్వారా 500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.యాసంగి సీజన్కుగాను 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాలుకు ఏ గ్రేడ్కు రూ.1888లు, సాధారణ గ్రేడ్ క్వింటాలుకు రూ.1868 కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. జిల్లాలో 28 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను పీఏసీఎస్ ఆధ్వర్యంలో 13, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 8, ఏఎంసీ ఆధ్వర్యంలో 3, పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆమన్గల్, కడ్తాల్, పడకల్, వెల్టాల్, మంచాల, బొడకొండ, శంకర్పల్లి, షాద్నగర్, కొందుర్గు, మేకగూడ, కందుకూరు, మల్కారం, పాలమాకుల, బండరావిర్యాల, బాచారం, గౌరెల్లి, రాచకొండ, మైలారం, కొత్తపేటలో, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, యాచా రం, చింతపట్ల, షాబాద్, కొహెడ, నాగిళ్లలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ ల ఆధ్వర్యంలో షాద్నగర్, ఆమన్గల్, సర్దార్నగర్, మంచాలలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టిన అనంతరమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.