నిజామాబాద్: శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం నుంచి ఎగువన వానలు కురుస్తుండంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9860 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీరాంసాగర్లో ప్రస్తుతం 1070.60 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 30.147 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.