మిర్యాలగూడ, జూలై 2 : మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం పల్లెప్రగతి పనులు చేపట్టారు. పారిశుధ్య పనులతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారాయి. పట్టణాల్లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలోని పలు కాలనీల్లో ప్రత్యేకాధికారి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ నాగేశ్వర్రావు పర్యటించారు. పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డును పరిశీలించారు. మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీడీఓతో పాటు అధికారులు పర్యటించి పనులను పర్యవేక్షించారు. దామరచర్ల మండలంలోని రాళ్లవాగుతండా, కొండ్రపోల్, రాజగట్టు గ్రామాలను ఏడీఏ, మండల ప్రత్యేకాధికారి పోరెడ్డి నాగమణి సందర్శించి ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆర్అండ్బీ ఈఈ నరేందర్ పర్యటించి మురుగుకాల్వలను శుభ్రం చేసే పనులు పరిశీలించారు. వేములపల్లి మండలంలోని మొల్కపట్నం, రావులపెంట, శెట్టిపాలెం గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది పిచ్చిమొక్కలను తొలగించారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు నందిని, బాలాజీనాయక్, జడ్పీటీసీ లలిత, ఎంపీడీఓలు జ్యోతిలక్ష్మి, మసూద్, జితేందర్రెడ్డి, ఎంపీఓ వీరారెడ్డి, రవికుమార్, సర్పంచులు కరుణాకర్రెడ్డి, పద్మ, వెంకట్రెడ్డి, పొన్నానాయక్, వరలక్ష్మి, రాంబాబు, కుర్ర శ్రీను, చామంతి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.
రెండో రోజూ అదే జోరు
హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పల్లె ప్రగతి కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహ వాతావరణంలో కొనసాగింది. ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించి వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య పనులు పరిశీలించారు. పెద్దవూర మండలంలోని బట్టుగూడెంలో మండల ప్రత్యేకాధికారి వీరబ్రహ్మాచారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీపీ చెన్ను అనూరాధ, ఎంపీడీఓ దుబ్బశ్యాం, ఎంపీఓ విజయకుమారి, సర్పంచులు చామకూరి చిన్న లింగారెడ్డి, సుంకిరెడ్డి ప్రభావతి, బాణావత్ శంకర్నాయక్, కూన్రెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.గుర్రంపోడు మండలంలోని లక్ష్మీదేవి గూడెం, కొప్పోల్, బుడ్డారెడ్డి గూడెం, బొల్లారం, నడికుడ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి భిక్షపతి పర్యటించి పనులను పరిశీలించారు. ఎంపీడీఓ సుధాకర్, సర్పంచులు సల్వాది నగేశ్, తిరుగుడు జ్యోతి, కామల్ల రేణుక, ఎండీ. సత్తార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో ఎవెన్యూ ప్లాంటేషన్ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 27,700 మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, నిమ్మల ఇందిరాగౌడ్, మంగ్తా నాయక్, రమేశ్ జీ, టీఆర్ఎస్ నాయకులు బూషరాజుల కృష్ణ, నిమ్మల కొండయ్య, ఆదాసు విక్రమ్, చంద్రమౌళి పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) మండలం తూటిపేట తండాలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్ రాంసింగ్నాయక్, కార్యదర్శి సోని పాల్గొన్నారు.నిడమనూరు మండలంలోని గుంటిపల్లి, వేంపాడు గ్రామాల్లో డీఆర్డీఓ, పల్లెప్రగతి మండల ప్రత్యేకాధికారి కాళిందిని పర్యటించారు. వైకుంఠ ధామాలు, పల్లెప్రకృతి వనాలు, వర్మికం పోస్టు షెడ్లు, కోతుల ఆహారశాలలు, గుంటిపల్లిలోని సామాజిక అటవీ వనాన్ని పరిశీలించారు. ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, ఎంపీఓ పల్లెబోయిన రామలింగయ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గుగులోతు వరలక్ష్మి, గ్రీష్మ, సర్పంచులు పోతెపాక సంధ్య, అర్వ స్వాతి పాల్గొన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో..
దేవరకొండ : మండలంలోని తాటికోల్, మడమడక, చింతబావి గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను ఎంపీడీఓ పరిశీలించారు. చందంపేట మండలంలోని కోరుట్ల, మూడుదండ్ల, చందంపేట, గుంటిపల్లి, బొల్లారం గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. పీఏపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో, డిండి మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలసుకొని పరిష్కరించారు. చింతపల్లి, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డుల్లో డ్రైనేజీలు శుభ్రం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు పల్లెప్రగతి పనులు చేపట్టారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డులల్లో మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, కమిషనర్ వెంకటయ్య, వైస్ చైర్మన్ రహత్అలీ, కౌన్సిలర్లు హన్మంత్ వెంకటేశ్గౌడ్, కౌన్సిలర్లు వడ్త్య దేవేందర్నాయక్, జయప్రకాశ్నారాయణ, నేతాళ్ల భాగ్యలక్ష్మీశ్రీనివాస్, రైతుబంధు మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, పొన్నబోయిన సైదులు, ఏఈ రాజు, ఎస్ఐ జాఫర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ఎంపీడీఓ రాములు, సర్పంచులు కుంభం శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, కవిత, అలివేలు, అనూరాధ, శంకర్రావు, కొండల్, పార్వతి పాల్గొన్నారు.