హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 2.21 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.96 లక్షల మంది, ప్రైవేటు కేంద్రాల్లో 25 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు మంగళవారం తెలిపింది. మొత్తం 1,121 కేంద్రా ల్లో వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పొందుతున్నవారిలో 18 ఏండ్ల పైబడినవారు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లు, ఇతర వర్గాలవారు ఉన్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ వృథా 0.11 శాతం మాత్రమే ఉందని, ఇది అత్యల్పమని పేర్కొన్నది.