న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు సైతం దిగి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. మరో వైపు 56,994 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 907 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,16,897కు పెరిగింది. ఇందులో 2,93,66,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మొత్తం 3,97,637 ప్రాణాలు వదిలారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 5,52,659
ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.