సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే.. కానీ బాక్సుల్లో అలాగే దాచుకోడానికి కాదు కదా. అయితే ఎన్ని రోజులు అని ఇంకా ఆ బాక్సుల్లోనే దాచేస్తారు. అరుంధతి సినిమాలో విలన్ పశుపతిని దాచేసినట్లు ఎక్కువ రోజులు దాచేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఇప్పుడు కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేస్తున్నారు. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా వెంకటేష్ లాంటి హీరోలు కూడా ఓటిటి వైపు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ప్రస్తుతం కొన్ని క్రేజీ సినిమాలు డిజిటల్ మీడియాలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం..