Vikarabad
- Feb 06, 2021 , 00:27:21
VIDEOS
అంతుచిక్కని వ్యాధితో ఆందోళన

- మృత్యువాతపడుతున్న మేకలు, కోళ్లు, కాకులు
- మృతిచెందిన కోళ్లు, కాకుల రక్త నమూనాల సేకరణ
- మైలారంలో పర్యటించి పరిశీలిస్తున్న వైద్యాధికారులు
ధారూరు, ఫిబ్రవరి 5 : మండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో వరుసగా పెంపుడు కోళ్లు, కాకులు అంతుచిక్కని వ్యాధితో మృతిచెందుతున్నాయి. మూడు రోజులుగా పశు వైద్యాధికారులు పరిశీలిస్తున్నా వ్యాధి అంతు చిక్కడంలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం దోర్నాల్లో మూడు కోళ్లు మృతిచెందాయని తెలిపారు. అదేవిధంగా మైలారం గ్రామంలో 3 కోళ్లు, 2 కాకులు, ఒక మేక మృతిచెందాయి. శుక్రవారం పశువైద్యాధికారులు గ్రామంలో పర్యటించి పరిశీలించారు. మృతి చెందిన కోళ్లు, కాకుల రక్త నమూనాలను తీసుకొని ల్యాబ్కు పంపించారు. బలహీనంగా ఉన్న కోళ్లకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో దోర్నాల్, మైలారం సర్పంచులు సుజాత, బాబ్యానాయక్ ఉన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల రోజును సెలవుదినంగా భావించొద్దు: మంత్రి కేటీఆర్
- తెలంగాణ టూరిజం అంబాసిడర్గా బిగ్బాస్ హారిక
- బెంగాల్ పోరు : ఐదుగురు ఎమ్మెల్యేలు గుడ్బై..దీదీ పార్టీకి ఎదురుదెబ్బ!
- జీలపల్లిలో వడదెబ్బతో వ్యక్తి మృతి
- 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఘనంగా నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్
- స్వచ్ఛంద ఈపీఎఫ్వో సభ్యులకు ‘ప్రత్యేక నిధి’!
- టీటీవీ దినకరణ్తో జతకట్టిన ఓవైసీ
- మేడ్చల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- మచ్చలేని వ్యక్తిత్వం సురభి వాణీదేవి సొంతం
- ఎన్ఐఏకు.. ముఖేష్ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం కేసు దర్యాప్తు
MOST READ
TRENDING