హైదరాబాద్ : అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. లోతుకుంటలో ఓ గుడిసెలో నివాసముంటున్న పూలమ్మ(43).. రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూలమ్మ హత్యకు వివాహేతర సంబంధమే కారణం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని అల్వాల్ ఎస్హెచ్వో ఏ గంగాధర్ తెలిపారు.