హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ ఎత్తేయడంతో.. సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలు తిరిగి ఇచ్చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ-పెట్టీ, ఈ-చలనాల ద్వారా పోలీసు స్టేషన్లో జరిమానాలు చెల్లించి వాహనాలు తీసుకెళ్లొచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపితే.. వాహనదారులు కోర్టులోనే జరిమానా చెల్లించొచ్చు. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఆ వాహనదారుడికి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.