మెదక్, జూన్ 21 : జూలై నుంచి అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందజేస్తామని, ఇందుకనుగుణంగా జిల్లాలో వివిధస్థాయిల్లో పెండింగ్లో ఉన్న 3,689 దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ము న్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. త్వరలో విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నారని.. ఇప్పటివరకు భద్రపర్చిన ధాన్యాన్ని త్వరగా రైస్మిల్లులకు తరలించాలన్నారు. ఈ యాసంగిలో వచ్చిన ధాన్యం ఉత్పత్తితోపాటు క్షేత్ర స్థా యిలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నవంబర్, డిసెంబర్లో వచ్చే ధాన్యాన్ని అంచనా వేసి తగిన కార్యా చరణ ప్రణాళికతో సిద్ధం చేసుకోవాలన్నారు. ధరణి పోర్టల్లో భూ సంబంధిత పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, మూటేషన్ భూ సమస్యలు, నిషేధిత భూముల ఆమోదం నిమిత్తం కలెక్టర్ లాగిన్కు పంపేటప్పుడు, జాగ్రత్తగా పరిశీలించాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రతి మండల కేంద్రం లేదా 10 ఎకరాల స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని, ఇందుకనువైన భూమిని గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలో సుమారు 50 వైకుంఠ ధా మాలను నిర్మించాల్సి ఉన్నదని, దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి పక్షం రోజుల్లో పూర్తి చేయాలని, లేకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ లభ్యత లేకపోవడంతో జిల్లాలో 34ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు కాలేదని, వీటి ఏర్పాటుకు కనీసం 20 గుంటల స్థలం గుర్తించి అందజేయాలని, లేదా దాతల నుంచి సేకరించాలని తహసీల్దార్లకు సూచించారు.
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఆక్షేపణలపై వచ్చిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. కొత్తగా ఆమోదించిన ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలని తహసీల్దార్లకు సూచించారు.
25లోగా అంచనా వ్యయంపై నివేదిక అందజేయాలి
ఏడో విడుత హరితహారంలో నిర్ధేశిత లక్ష్యంపై అంచనా వ్యయ నివేదికను 25వ తేదీలోగా అందజేయాలని ఆదేశిం చారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ అధికారుల సమష్టి కృషితో హరితహారంలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని కోరారు. సెగ్రిగేషన్ షెడ్లను వాడుకలోకి తేవాలని, వైకుంఠధామాల్లో వసతులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ లు నిర్మించి, మొక్కలు నాటాలని సూచించారు. ఆస్తి పన్ను వసూళ్లలో ఏప్రిల్ నాటికి 99 శాతం లక్ష్యాన్ని సాధించామని, మిగిలిన ఒక శాతం పన్ను వసూలు చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో ప్రతి శ్రామికుడు 239 పని దినాలను పని చేయించాలని డీఆర్డీవోకు సూచించారు. మున్సిపల్ వార్డు కమిటీల సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అక్రమ కట్టడాలను కూల్చి వే యాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యం కాపాడడం బాధ్యత అని, సంపూర్ణ పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎస్వో శ్రీనివాస్, బీసీ సంక్షేమాధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, మండల ప్రత్యేకాధికారులు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.