డివైడర్ను ఢీకొన్న కారు ఒకరు మృతి

- ఇద్దరికి తీవ్ర గాయాలు
బొంరాస్పేట, జనవరి 24 : హైదరాబాద్-బీజాపూర్ 163వ నెంబరు జాతీయ రహదారిపై మండలంలోని భోజన్నగడ్డతండా శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ శ్రీశైలం కథనం ప్రకారం.. మహబూబ్నగర్కు చెందిన సిరిగిరి అంజప్ప(32) ఎల్ఈడీ బల్బులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నుంచి బయలుదేరి మండలంలోని తుంకిమెట్ల అంగడిలో బల్బులు అమ్ముకుని తన మారుతీ ఒమ్నీ వాహనంలో మధ్యాహ్నం వికారాబాద్కు బయలుదేరాడు. భోజన్నగడ్డతండా స్టేజీ మలుపులో వాహనం అతి వేగంగా కల్వర్టు డివైడర్ను ఢీకొట్టడంతో అంజప్ప, వాహనంలో ఉన్న అతడి కొడుకు వివేక్, అన్న కూతురు మనీషాలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే పరిగి దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ అంజప్ప మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ శ్రీశైలం తెలిపాడు. ఒమ్నీ వాహనం కల్వర్టు గోడను ఎక్కడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
తాజావార్తలు
- గల్వాన్లో మనపై దాడిచేసిన చైనా కమాండర్కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్