సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మే 12 నుంచి జూన్ 19 వరకు లాక్డౌన్ విధించిన విషయం విధితమే. అయితే యువత లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతూ.. ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. పోలీసులకు పట్టుబడ్డారు. రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో రేసింగ్లకు సైతం పాల్పడ్డారు. ఒక్కో కమిషనరేట్ పరిధిలో 10 వేల వరకు ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదయ్యాయి. వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. అధికంగా మైనర్లు పట్టుబడటంతో ట్రాఫిక్ పోలీసులు కాంటాక్టు, నాన్ కాంటాక్టు పద్ధతిలో జరిమానాలు విధించారు.