సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : నగరంలో నైరుతి రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గింది. భారీ వర్షాలు పడుతాయని ఆశించినా.. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉరుములతో కూడిన జల్లులు మాత్రమే పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటున్నా… మరో వారం రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గరిష్టం 34.0, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 47 శాతంగా నమోదయ్యింది.