సియోల్: దక్షిణ కొరియాకు చెందిన టెక్ సంస్థ ఎల్టీ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలోనే తొలి 83 అంగుళాల ఓఎల్ఈడీ టీవీని ఆదివారం లాంచ్ చేసింది. 83సీ1గా పిలుస్తున్న ఈ టీవీ 4కే రెజల్యూషన్తో వస్తున్న అతిపెద్ద ఓఎల్ఈడీ టీవీ కావడం విశేషం. ఈ 83సీ1 మొదట సౌత్ కొరియా, అమెరికాల్లో ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. కొరియాలో దీని ధరను 9630 డాలర్లు (సుమారు రూ.7.14 లక్షలు)గా నిర్ణయించారు. ఇప్పటికే ఎల్జీలో 48, 55, 65, 77, 88 అంగుళాల ఓఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. 88 అంగుళాల టీవీ 8కే రెజల్యూషన్తో వస్తుంది.
ఈ తాజా 83సీ1 టీవీలోని ప్రత్యేకమైన ఫీచర్ల వల్ల ఇందులో గేమ్స్ ఆడినప్పుడు, స్పోర్ట్స్ చూసినప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఎల్టీ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఈ టీవీని 2021 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శించారు. ఈ కొత్త టీవీతో ప్రిమియం కేటగిరీలో ఎల్జీ తన పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2021 తొలి మూడు నెలల్లో ఎల్టీ 7,92,000 ఓఎల్ఈడీ టీవీలను ఉత్పత్తి చేసింది.