సూర్యాపేట : మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అమరుడు కర్నల్ సంతోష్బాబు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ సభలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కర్నల్ సంతోష్బాబు లాంటి గొప్ప వ్యక్తిని కన్న వారి తల్లిదండ్రులు ధన్యజీవులు అన్నారు. ఉపాధి లేక విల్లవిల్లాడుతున్న చేనేత రంగాన్ని ఆదుకున్న గొప్ప వ్యక్తి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలొచ్చాయంటే ఆ ఘనత మంత్రి కేటీఆర్దేనన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లదేనని పేర్కొన్నారు.