హైదరాబాద్ : రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్కు తెప్పించారు. ప్రగతిభవన్లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అదనపు కలెక్టర్లకు సీఎం స్వయంగా వాహనాలు అందజేయనున్నారు. ఇందుకు కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.