నల్లగొండ : నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన నామా నర్సింహ (32) శనివారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దోసపాటి వెంకటయ్య అతడిని వీధిలో అడ్డగించి గొడ్డలితో నరికి హతమార్చాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడు వెంకటయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. హత్యకు గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని ఎస్ఐ వీరబాబు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.