మెహిదీపట్నం, జూన్ 11 : నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అనుక్షణం శ్రమిస్తున్నారని, కరోనా విపత్కర పరిస్థితులను ఎంతో మనో ధైర్యంతో ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ అన్నారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో దాతల సహకారంతో రూ.15 లక్షలతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ను శుక్రవారం సీపీ..అదనపు కమిషనర్లు శిఖా గోయెల్, అనిల్ కుమార్, డీఎస్ చౌహాన్, పశ్చి మ మండలం డీసీపీ ఎఆర్.శ్రీనివాస్, డీసీపీలు రమేశ్, గజరావు భూపాల్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి ప్రారంభించారు. అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, గోషామహల్ , బంజారాహిల్స్, ఆసిఫ్నగర్ ఏసీపీలు నరేందర్ రెడ్డి, ఆర్జీ శివమారుతి, సుదర్శన్, పశ్చిమ మండలంలోని ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.