హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఎంసెట్కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. అందులో ఎంసెట్ ఇంజినీరింగ్కు 1,46,541, ఫార్మాకు 73,486 దరఖాస్తులు వచ్చాయన్నారు.