దుబాయ్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అంపైర్లు ఖరారయ్యారు. ఈనెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా మొదలయ్యే మ్యాచ్కు ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, మైఖేల్ గాఫ్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా, క్రిస్ బ్రాడ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వర్తించనున్నాడు. టీవీ అంపైర్గా రిచర్డ్ కెటిల్బ్రా, నాలుగో అంపైర్గా అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారని ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు అనుభవం కల్గిన అంపైర్లు, అధికారులను నియమిం చాం. కరోనా వైరస్ విజృంభణ సమయంలో విధులు నిర్వర్తించడం అంత తేలిక కాదు. కానీ గత కొన్నేండ్లుగా అత్యుత్తమ సేవలందిస్తున్న అంపైర్లు మనకు అందుబాటులో ఉన్నారు’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ అడ్రియన్ గ్రిఫిత్ అన్నాడు.