దుబాయ్: క్రికెట్లో అత్యుత్తమ టెస్టు సిరీస్గా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకే అభిమానులు పట్టం కట్టారు. ఈ ఏడాది జనవరి 19న ఆసీస్ కంచుకోట గబ్బాను బద్దలుకొట్టి టెస్టు సిరీస్ను టీమ్ఇండియా 2-1తో గెలిచింది. అందుకే ఐసీసీ నిర్వహించిన ఓటింగ్లో ఆ సిరీస్కే అభిమానులు ఓట్లతో పట్టం కట్టారు. 1999లో భారత్-పాక్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన 2005 యాషెస్ సిరీస్ మూడో ప్లేస్కే పరిమితమైంది. వర్చువల్ పోల్లో మొత్తం 70 లక్షల ఓట్లు పోలయ్యాయని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అగ్రస్థానంలో నిలిచిందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది.