ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 876 మంది కోలుకున్నారు. 24 గంటల్లో కరోనాబారిన పడి 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,208గా ఉంది. ఇప్పటి వరకు 13,99,640 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 24,627కు చేరింది.