కేపీహెచ్బీ కాలనీ, జూన్ 2 : కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నదని నియోజకవర్గంలోని నిత్య సేవకులందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం మూసాపేట సర్కిల్లోని ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే కరోనా రహితంగా సమాజం మారుతుందన్నారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు తదితరులు ఉన్నారు.