ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి

వికారాబాద్: జిల్లాలో మిగిలిపోయిన ఎస్డబ్ల్యుఎం షెడ్లను సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయా లని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికారులకు ఆదే శించారు. శుక్రవారం మద్గుల్ చిట్టంపల్లి డీపీఆర్సీ సెంటర్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో జిల్లాలో చేపట్టిన డంపింగ్ యార్డులు, ఎస్డబ్ల్యుఎం షెడ్లు, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిలిచిపోయిన డంపింగ్యార్డులు, వైకుంఠధామాల పనులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని సూచించారు.
వికారాబాద్, తాండూరు, కోట్పల్లి మండలాల్లో డంపింగ్యార్డు పనులు అన్ని పూర్తి అయ్యాయని కలెక్టర్ తెలిపారు. కొద్ది మొత్తంలో మిగిలియున్న పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అలాగే వైకుంఠధామా వద్ద నర్సరీల నుంచి మొక్కలు సేకరించి నాటాలని సూచించారు. ప్రత్యేకశ్రద్ధ వహించి అధికారులు ఈ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో రిజ్వానా, ఈఈపీఆర్ శ్రీనివాస్రెడ్డిలతో పాటు అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
- యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
- అఫ్రిది వయసెంతో అతనికైనా తెలుసా?
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!