హైదరాబాద్ ,మే 31: లాక్ డౌన్ కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం నాయకులు. నగరంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆకలితో అలమటిస్తున్న కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు గత పదిహేను రోజులుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు (కాపు)నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ,తెలంగాణ మున్నూరు కాపు సంఘం సంయుక్తాధ్వర్యంలో గాయిత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర పటేల్ , కొండ దేవయ్య పటేల్ , అల్లం కిషన్ రావు పటేల్,కొత్త లక్ష్మణ్ పటేల్ సహకారంతో హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం , శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి , గచ్చిబౌలి టిమ్స్ , బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్,ఎల్బీనగర్ ప్రభుత్వ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ లలో కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నవారికి, వారి బంధువులకు 2వేల మందికి పైగా భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్,పెరిక రమేష్, వాసాల వెంకటేశ్వర్లు , వాసాల రాజు, గంప సురేష్ ,ఆఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.