ఉస్మానియా యూనివర్సిటీ, మే 30: కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వానిదే బాధ్యతకాదని ప్రజల బాధ్యత, భాగస్వామ్యంతోనే చెక్ పెట్టవచ్చనినగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. ఆదివారం వివిధ కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడంతోనే కరోనా సోకే అవకాశం ఎక్కువ ఉంటుందని వివరించారు. ఒకరి నిర్లక్ష్యం వలన ఎంతో మందికి ప్రాణాపాయం కలుగుతోందని అన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించినపుడే కరోనా నివారణ సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.