షాబాద్, మే 28: సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్తో కరోనా కట్టడి అవుతుందని, జ్వర సర్వేలాగానే ఈ టీకాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డిజిల్లాలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన సరూర్నగర్ పీహెచ్సీ, బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల, మహేశ్వరం గడికోట పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అమయ్కుమార్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి మంది జర్నలిస్టులకు టీకాలు వేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు, పెట్రోల్పంపుల సిబ్బంది, ఫర్టిలైజర్స్, ఇతర దుకాణదారులు, వివిధ వ్యాపారులకు టీకాలు వేసేందుకు 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 9,500 మంది, జీహెచ్ఎంసీ పరిధిలో 35వేల మందిని వ్యాక్సినేషన్ కోసం గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు తగ్గుముఖం పడతున్నట్లు మంత్రి వివరించారు. జిల్లాలో సరిపడ ఆక్సిజన్, ఇంజక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్లు పారిజాతనర్సింహారెడ్డి, దుర్గాదీన్లాల్చౌహన్, డిప్యూటీమేయర్ ఇబ్రహీం, కమిషనర్లు, వైద్యశాఖ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
లక్ష్యం మేరకు వ్యాక్సిన్లు వేయాలి