తిరుపతి : తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గాన్ని జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని సూచించింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.