అల వైకుంఠపురములో చిత్రంతో బుట్టబొమ్మగా మారిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ జాబితాలో నిలిచింది. తెలుగులోనే కాక తమిళం, హిందీలోను పలు సినిమాలు చేస్తుంది. పూజా నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా వలన షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
తాజాగా పైజామా గాళ్స్.. ట్విన్నింగ్ అప్!! అంటూ తన బంధువు అయిన అమ్మాయితో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ పైజామా ధరించి ఎంతో అందంగా కనిపిస్తుండగా, పూజాతో పాటు ఉన్న అమ్మాయి కూడా బుట్టబొమ్మలానే ఉంది కదూ అంటు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి పూజా డూప్ మరెక్కడో కాకుండా వారి ఫ్యామిలీలోనే ఉండడం విశేషం.