న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. ఇటీవల కొత్త కేసులు తగ్గుతున్నా.. మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 4,194 మంది మహమ్మారి బారినపడ్డారు. తాజాగా 3,57,630 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగాయి. ఇప్పటి వరకు 2,30,70,365 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 19,33,72,819 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 20,66,285 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32,64,84,155 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.