ఒట్టావా : భారత విమానాలపై విధించిన బ్యాన్ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో చాలా మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడం, కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గకపోవడంతో మరోసారి బ్యాన్ను పొడగించినట్లు కెనడా రవాణాశాఖ మంత్రి అల్ఘాబ్రా పేర్కొన్నారు.
నిషేధం విధించిన నాటి నుంచి కెనడాకు వచ్చిన విమాన ప్రయాణికుల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని అల్ఘాబ్రా చెప్పారు. తాజా బ్యాన్తోనూ కార్గో విమానాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణాలపై ఏమాత్రం తొందరపడడం లేదన్నారు. టీకాల పంపిణీ కొనసాగుతున్నందున గతవారం నుంచి దేశంలో రోజువారీ కొత్త కేసులు 25శాతం పడిపోయాయని డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజువారీ కేసులు 5వేల వరకు నమోదవుతున్నాయని తెలిపారు.