ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
అత్యవసరమైతేనే బయటకు రావాలి
జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్న
ఆదిలాబాద్ రూరల్, మే 20: ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. గురువారం కైలాస్నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా సోకిన వారు దవాఖానకు వెళ్లడానికి, కొవిడ్తో మృతిచెందిన వారిని తరలించడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 9515060231కు కాల్ చేస్తే సేవలు అందుతాయని తెలిపారు.
కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం జెండా ఊపి అంబులెన్స్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలో కరోనా సోకిన వారిని దవాఖానలకు తీసుకెళ్లడానికి ఎవ రూ ముందుకు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వాహనం కోసం టోల్ ఫ్రీ నంబర్ 9515060231కు కాల్చేస్తే వారి ఇంటికి వెళ్లి దవాఖానలకు తీసుకెళ్తుందన్నారు. కొవిడ్తో మరణించిన వారి శవాలను తరలించడానికి కూడా వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, భరత్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, దమ్మపాల్, రాంకుమార్, లక్ష్మణ్ , యూనిస్ అక్బానీ, నారాయణ,రాజు పాల్గొన్నారు.