న్యూఢిల్లీ: దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలోని 180 జిల్లాల్లో గత వారంరోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గత 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేదని ఆ ప్రకటనలో తెలిపింది. 54 జల్లాల్లో అయితే గత మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేదని వెల్లడించింది.