కేఎంసీ సూపర్స్పెషాలిటీ వైద్యశాలలో సేవలు ప్రారంభం
రూ.150 కోట్లతో సకల వసతులతో నిర్మాణం
సాధారణ రోగులకు వైద్యం
ఎంజీఎం నుంచి ఇక్కడికి తరలింపు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 30: కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో సాధారణ వైద్యసేవలు అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి అక్కడ అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున కొవిడ్ విభాగాన్ని విస్తరించేందుకే కేఎంసీలో సూపర్స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేసి అత్యవర, సాధారణ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పా రు. మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన వైద్యసేవల కోసం ప్రత్యేకంగా వార్డులను ఏర్పా టు చేసి 50 పడకలను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి వాటిని విస్తరించనున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యసేవల కోసం ఎంజీఎంకు వచ్చిన రోగులను ప్రత్యేక అంబులెన్స్ లో కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు. తగినన్ని ఆక్సిజన్ నిల్వలు, ఔషధాలను అందుబాటులో ఉంచారు.