న్యూఢిల్లీ : ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దేశంలో 24 గంటల్లో 3,293 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ మరణాల్లో ఇప్పటి వరకు అత్యధికం కాగా.. ఇప్పటి దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 2,01,187కు చేరింది. నిన్న ఒకే రోజు మహారాష్ట్రలో గరిష్ఠంగా 895 మంది, ఢిల్లీలో 381, ఉత్తరప్రదేశ్లో 264, ఛత్తీస్గఢ్లో 246, కర్ణాటక 180, గుజరాత్ 170, ఝార్ఖండ్ 131, రాజస్థాన్లో 121, పంజాబ్లో వంద మంది మృతి చెందారు.
జాతీయ మరణాల రేటు పడిపోతోందని, ప్రస్తుతం 1.12శాతంగా ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ల్లో 73.59శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 3,60,960 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 66,358 కేసులు, ఆ తర్వాత యూపీలో 32,921, కేరళలో 32,819 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 29,78,709కు చేరింది.
మొత్తం కేసుల్లో 16.55శాతం ఉన్నాయని, 24 గంటల్లో 96,505 కేసులు పెరుగుదల నమోదైంది. దేశంలో ఉన్న క్రియాశీల కేసుల్లో 71.91 శాతం మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయని పేర్కొంది. మరో వైపు దేశంలో కొనసాగుతున్న టీకా డ్రైవ్లో భాగంగా 14.78 కోట్ల డోసులు వేసినట్లు మంత్రిత్వశాఖ చెప్పింది. ఇవాళ ఉదయం 7 గంటలకు అందిన నివేదిక ప్రకారం.. 21,18,435 సెషన్ల ద్వారా ఇప్పటి వరకు 14,78,27,367 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.