హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వివిధ నీటి వనరుల్లో ఈ సంవత్సరం 90 కోట్ల చేప పిల్లలు, 6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. చేప పిల్లల పంపిణీపై సోమవారం మంత్రి సమీక్షిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడా ది 18,335 చెరువుల్లో 68.52 కోట్ల చేప పిల్లలను, 93 చెరువుల్లో 4 కోట్ల రొయ్యలను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా చేపపిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 28,968 చెరువులను జియో ట్యాగింగ్ పూర్తయ్యిందని, మిగిలిన చెరువులకు కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నా రు. హోల్సేల్ చేపల మార్కెట్, ప్రాసెసింగ్ యూ నిట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పశుగ్రాసం కొరత లేకుండా చర్య లు తీసుకోవాలని, సబ్సిడీపై గడ్డి విత్తనాలను అం దించాలని ఆదేశించారు. సమావేశంలో పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్య్సశాఖ కమిషనర్ లచ్చిరాం భుక్యా పాల్గొన్నారు.