నగరంలో బయోవేస్ట్ను తరలించే వాహనాలపై పీసీబీ నిఘా పెంచింది. కొవిడ్ వ్యాప్తి, నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం క్లినికల్ జీవ వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువైంది. ప్రతిరోజు వేల టన్నుల బయో వ్యర్థాలు కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు చేరుతున్నాయి. అయితే కొందరు ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించకుండా.. రాత్రి సమయాల్లో డంపింగ్ యార్డులకు, శివారులోని ఖాళీ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బయో వ్యర్థాలను తరలించే 56 వాహనాలను జీపీఎస్తో అనుసంధానం చేసింది. ఈ వాహనాలను పీసీబీ కేంద్ర కార్యాలయం నుంచి జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు.