మ్యాడ్రిడ్ : హాలీవుడ్ ప్రసిద్ధ జేమ్స్ బాండ్ సిరీస్లో 25 వ చిత్రం ‘నో టైమ్ టు డై’ అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీమియర్తో విడుదల కానున్నట్లుగా సమాచారం. లండన్లో జరిగే గ్రాండ్ ప్రీమియర్ కోసం 100 కోట్ల బడ్జెట్ను మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రంలో తెరవెనుక ఉన్నవారి కోసం లండన్లోని వెంబ్లీ అరేనా స్టేడియంలో ప్రత్యేక ప్రీమియర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూసివేతకు గురయ్యాయి. దాంతో ఈ సినిమా విడుదల అప్పటినుంచి నాలుగుసార్లు వాయిదాపడింది. చైనా, భారత్తో పాటు పలు దేశాల్లో కూడా దీని ప్రమోషనల్ టూర్ కూడా నిలిచిపోయింది. వాస్తవానికి, ఈ చిత్రం బాండ్ పాత్రలో డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం అవనున్నది. అందువల్ల క్రెయిగ్ అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని మూడు ప్రధాన సంస్థలైన ఎంజీఎం, యూనివర్సల్, బాండ్ ప్రొడ్యూసర్స్ నిర్మించారు. ప్రపంచ సినిమాల్లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన జేమ్స్ బాండ్కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు.
బాండ్ చిత్రాల శైలి, యాక్షన్, పేస్, గాడ్జెట్లు భిన్నమైన థ్రిల్ను కలిగిస్తాయి. 2020 ఏప్రిల్ నుంచి నిర్మించిన ఈ చిత్రం రెండవ ట్రైలర్ గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైంది. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇది ప్రేక్షకుల ఉత్సుకతను మరింత పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాండ్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. అలాగే, థియేటర్లో చూడటం ద్వారా మరింత కొత్త అనుభూతిని పొందేందుకుగాను ఓటీటీ ప్లాట్ఫారమ్కు వెళ్లకూడదని కూడా నిర్ణయించారు. బాండ్ సిరీస్ సినిమాలకు చైనా మంచి మార్కెట్గా పరిగణిస్తున్నారు. మునుపటి సిరీస్ ‘స్పెక్టర్’ చిత్రం ఇక్కడ రూ.800 కోట్ల మేర వసూలు చేసింది. ఇప్పుడు చైనాలో థియేటర్లు పూర్తిగా తెరిచినందున.. నిర్మాతలు ఆదాయాల పరిధిని పరిశీలిస్తున్నారు.
కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన పక్షంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే భారతదేశంలో విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు.
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..