ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో 68 వేలకుపైగా కరోనా కేసులు, 500కుపైగా మరణాలు వెలుగుచూశాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 68,631 కరోనా కేసులు, 503 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,39,338కు, మరణాల సంఖ్య 60,473కు పెరిగింది.
మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 45,654 మంది కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31, 06,828కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,70,388 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.