నిజామాబాద్ : జిల్లా దవాఖానలో కరోనాతో మృతి చెందిన మృత దేహాలు తారు మారు కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్కు చెందిన నర్సుబాయి, ఇస్లాంపురకు చెందిన బీబీలు ఇద్దరు కరోనా బారినపడి జిల్లా దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.
కరోనాతో మృతి చెందడంతో మృత దేహాలను పూర్తిగా ప్యాక్ చేయడంతో బీబీ మృతదేహాన్ని నర్సు బాయి కుటుంబానికి అందజేశారు. నర్సుబాయి కుటుంబీకులు తమకు ఎలాంటి సంబంధం లేని బీబీ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం మర్చురీలో నర్సుబాయి మృతదేహం ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు