జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమక్షంలో వేద పండితుడు అడిశెర్ల రామయ్య వేద మంత్రోచ్ఛరణల మధ్య లేగదూడకు బారసాల నిర్వహించారు. గణేశుడి మండపం వద్ద ఊయల కట్టి, లేగదూడను అందులో పడుకోబెట్టి పాటలు పడారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి పూజలు చేశారు. ఐదుగురు వ్యక్తులు లేగదూడకు నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి పెట్టారు.