అలంపూర్/అయిజ, ఏప్రిల్ 10 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. పల్లె లు బాగుంటేనే దేశం అ భివృద్ధి చెందుతుందనే భావనతో సీఎం కేసీఆర్ ‘పల్లె ప్రగతి’ పథకంతో ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నారు. రెండేండ్లు గా చేపడుతున్న పల్లెప్రగతి పనులతో గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి పైసా సద్వినియోగం చేసుకుంటూ పాలకులు పల్లెలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. జో గుళాంబ గద్వాల జిల్లా అయిజ మం డలం ఉత్తనూర్ గ్రామం ఉత్తమంగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లా ద్వారా వంద శాతం నీరు అందుతున్నది.
జి ల్లాలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. రూ.12.50 లక్షలతో ని ర్మించిన వైకుంఠధామం, రూ.6.50 లక్షలతో చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్డు పనులు పూర్తి చేసుకుని ప్రా రంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని వార్డు ల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎల్ఈడీ లై ట్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ, రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.66,25,057 వ్యయంతో రెండేండ్లుగా గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ర్టానికే మోడల్గా రైతు వేదిక’..
రాష్ట్రంలోనే మోడల్ ‘రైతు వేదిక’ ఉత్తనూర్లో నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికకు రూ. 22 లక్షలు విడుదల చేయగా, అదనంగా మరో రూ.40 లక్షలు వెచ్చించి ఎక్కడా లేని విధంగా స కల సౌకర్యాలు కల్పించారు. రైతువేదిక ప్రాంగణం లో పచ్చిక బయళ్లు, రంగురంగుల పూల మొక్క లు, నాగలితో అరక పట్టిన రైతు, ఎద్దుల బొమ్మ లు, బండి, నాగలి ఏర్పాటు చేశారు. రైతు వేదిక వెలుపల డిజిటల్ స్క్రీన్, సాంప్రదాయ సాగు నుం చి ఆధునిక సాగు వరకు జరుగుతున్న మార్పులు, కార్తులు, పండించాల్సిన పంటల వివరాలను డిజిటల్ విధానంలో ఏర్పాటు చేశారు.
అత్యాధునిక సౌకర్యాలతో ఆరోగ్య ఉప కేంద్రం..
పల్లె ప్రజలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చా రు. రోగులు, గర్భిణులు, బాలింతలు, చి న్నారులకు అనువుగా ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆరు బెడ్లతో ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
చౌటుప్పల్ తరహాలో పల్లె ప్రకృతి వనం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ తరహాలో ఉత్తనూరులో పల్లె ప్రకృతి వనం ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాం గణంలో అర ఎకరా భూమిని కేటాయించారు. రా జమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మొక్కలను సేకరిస్తున్నారు. మోడల్ పల్లె ప్రకృతి వనంగా ఉత్తనూర్ నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా నర్సరీలో పెరుగుతున్న మొ క్కలతోపాటు రాజమండ్రి, హైదరాబాద్, చౌటుప్పల్ నుంచి మొక్కలు తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు.
మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి..
గ్రామ పంచాయతీలో సక ల సౌకర్యాలు కల్పించి రా ష్ట్రంలోనే మోడల్ గ్రామ పం చాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు, దాతల సహకారంతో అన్ని ర కాల సౌకర్యాలు కల్పిస్తు న్నాం. ప్రతి భవన నిర్మాణా ల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. రైతువేదిక, బా స్కెట్బాల్ కోర్టు, కార్పొరేట్ వసతులతో ప్రభుత్వ పాఠశాల వంటివి రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మా జీ జెడ్పీటీసీ తిరుమల్రెడ్డి సహాయ సహకారాలతో మోడ ల్ విలేజ్గా గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
అభివృద్ధికి కేరాఫ్ ఉత్తనూర్..
ఉత్తనూర్ పంచాయతీని అభివృద్ధికి కేరాఫ్గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రభు త్వ నిధులతోపాటు దాతలు ముందుకు వస్తుండటంతో అ న్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఏర్పడుతున్నది. గ్రా మంలో ఇంటింటికీ మిషన్ భ గీరథ నీటిని అందిస్తున్నాం. పరిశుభ్రతకూ ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.