న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి పన్ను వసూలయ్యాయి. కరోనా తీవ్రరూపం దాల్చినప్పటికీ 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల మేర ఆదాయ, కార్పొరేట్ పన్ను వసూలైనట్లు పన్ను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 5 శాతం అధికంగా వసూలవడం గమనార్హం. గతేడాదికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో రూ.13.19 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఈ అంచనాను రూ.9.05 లక్షల కోట్లకు కుదించింది. కానీ, ప్రత్యక్ష పన్ను వసూళ్ళలలో మాత్రం 10 శాతం గండిపడింది.