గుమ్మడిదల, ఏప్రిల్ 9 : కొవిడ్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని ఎస్ఐ విజయకృష్ణ అన్నారు. శుక్రవారం బొంతపల్లి జాతీయ ప్రధాన రహదారి పై మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వా హనదారులకు సర్పంచ్ నవీనాశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్గౌడ్, ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, పంచాయతీ పాలకవర్గంతో కలిసి మా స్కులు అందజేశారు. మొదటిసారిగా హెచ్చరిస్తూ మాస్కు లు, భౌతికదూరాన్ని పాటించాలని కోరారు. మాస్కులు లేని వారికి పంచాయతీ నుంచి మాస్కులు అందజేశారు.
భౌతికదూరం పాటించాలి : సీఐ
జిన్నారం, ఏప్రిల్ 9 : రోజు రోజుకు కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్లను విధిగా ధరించాలని సీఐ లాలునాయక్ కోరారు. శుక్రవారం జిన్నారంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చేతులను శానిటైజ్ చేసుకొని భౌతికదూరం పాటించాలని కోరారు.
కరోనా టీకాలు వేసుకున్న ఆర్టీసీ సిబ్బంది
సంగారెడ్డి, ఏప్రిల్ 9 : ఆర్టీసీ అధికారులు, సిబ్బంది శుక్రవారం పట్టణంలోని మార్క్స్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో టీకాలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ రెండో దశ కరోనాను అధిగమించడానికి జాగ్రత్తలతో పాటు తప్పని సరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నవీన్ యాదవ్, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి
అమీన్పూర్, ఏప్రిల్ 9 : కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కొవిడ్ నిబంధనలను పాటించాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. పటాన్చెరు ఏరియా దవాఖాన లో ఆయన సతీమణితో కలిసి కొవిడ్ టీకా వేయించుకున్నా రు. ఆయనతో పాటు కౌన్సిలర్ కల్పన ఉపేందర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు రాములు, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్రెడ్డి, యాదగిరి, దాసుయాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇవీ కూడా చదవండి…
రైలు సర్వీసులు తగ్గించం.. రైల్వే బోర్డు
అగ్గికురిసే ఎండలో.. గోదారమ్మ జలసవ్వడి