న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,964 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పడిపోవడమే దేశీయంగా బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, దేశీయంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ కిలో వెండి ధర రూ.216 తగ్గి రూ.64,222కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.64,438 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,727 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.78 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎల్జీ కంపెనీ సంచలన నిర్ణయం..!
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో
టీకా వేయించుకుంటే ముక్కుపుల్ల ఉచితం..!
మధుమేహం ఉన్నవారు కార్న్ఫ్లేక్స్ తినొచ్చా..?