హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికలు ముగిశాక ఏర్పడ్డ సాధారణ, ఆకస్మిక ఖాళీలు, 45 రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించక అర్హత కోల్పోయిన అభ్యర్థుల స్థానంలో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. వార్డులవారీ ఓటరులిస్టుల తయారీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేసినట్టు ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 3న వార్డులవారీ ముసాయిదా ఎలక్టోరల్ జాబితా ప్రచురణ, 12న తుదిజాబితా ప్రచురించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 123 సర్పంచులు, 2,275 వార్డుమెంబర్లు, 58 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవీ కూడా చదవండి
జూన్ వరకూ.. వృద్ధుల ఎస్బీఐ వీకేర్ గడువు పొడిగింపు
ఆటో డెబిట్ చెల్లింపులకు విఘాతం!