అమరావతి : 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోద ముద్ర వేసింది.
మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. ప్రభుత్వం త్వరలో ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదానికి పంపనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
ఏపీ మంత్రులంతా ఆర్డినెన్స్కు ఆన్లైన్ ద్వారా ఆమోదం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ అదేరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోద ముద్ర వేయడం యాదృశ్చికం.