రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. అజీజ్నగర్లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. అప్పటికీ ఆగకపోవడంతో పక్కనే ఉన్న గోడను గుద్దింది. దీంతో కారులో ఉన్న ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.