ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఎన్నో ఏళ్లు కష్టపడితే గానీ కొందరికీ విజయం దక్కదు. అలా ఆలస్యంగా విజయం అందుకున్న వాళ్లలో నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు. జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయాడు ఈ కుర్ర హీరో. ఈయన కోసం నిర్మాతలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల కిందట ఇండస్ట్రీకి వచ్చిన నవీన్.. ముందు యూ ట్యూబ్లో సత్తా చూపించాడు. ఆల్ ఇండియా bakchod కార్యక్రమంతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తర్వాత యాంకర్గా కూడా పని చేశాడు. దాంతో పాటు హిందీలో చిచోరే సినిమాలో నటించాడు.
Read more: చావు కబురు చల్లగా రివ్యూ..
ఎన్ని చేసినా మాతృభాషలో విజయం అందుకోవడానికి ఈ హీరోకు కాస్త వేచి చూడాల్సి వచ్చింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు జాతిరత్నాలు సినిమాతో స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత తన రెమ్యూనరేషన్ కూడా మూడింతలు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలకు లక్షల్లో పారితోషికం అందుకున్న ఈయన.. ఇప్పుడు కోట్ల వైపు అడుగులు వేస్తున్నాడు.
Read more: త్రిషకు ఘోర అవమానం.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..
తాను సైన్ చేయబోయే తర్వాత సినిమాకు ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతి రత్నాలు సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసిన తర్వాత నిర్మాతలు కూడా ఈయన అడిగినంత ఇచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వారం రోజుల్లో రూ.28 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ కలెక్షన్లు చూసిన తర్వాత తన రేటు కూడా పెంచేశాడు నవీన్ పొలిశెట్టి. అందుకే మరి పెద్ద వాళ్లు చెప్పేది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఇప్పుడు నవీన్ ఇదే చేస్తున్నాడు. ఇదే జోరులో ఆయన మరో రెండు విజయాలు అందుకుంటే మరో విజయ్ దేవరకొండ కావడం ఖాయం.